ఈనెల 11న మంగళగిరికి పవన్ కళ్యాణ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 11వ తేదీన మంగళగిరి కి వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 14వ తేదీన మధ్యాహ్నం మచిలీపట్నంలో జనసేన ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

14వ తేదీన సాయంత్రం మచిలీపట్నంలో నిర్వహించే జనసేన పదవ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో హాజరుకానున్నారు. 34 ఎకరాల్లో సభ కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే ఈ సభకు పార్టీ శ్రేణులు భారీ జన సమీకరణ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news