లోకేష్ ది ఎర్ర బుక్ కాదు, ఎర్రి బుక్ – అవంతి శ్రీనివాస్

-

నారా లోకేష్ ది ఎర్ర బుక్ కాదు, ఎర్రి బుక్ అంటూ చురకలు అంటించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. సీఎం జగన్‌ దైర్యం ముందు చంద్రబాబు, లోకేష్ ఎంత..సీఎం జగన్ దైర్యవంతుడు కాబట్టి ఎమ్మెల్యే సీట్లు మార్చారని తెలిపారు. లోకేష్ శంఖారావం సభ అట్టర్ ఫ్లాప్, లోకేష్ సభకు స్పందన జీరో అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఎవరో రాసిన స్కిఫ్ట్ లోకేష్ చదువుతున్నాడు..లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

avanthi srinivas slams nara lokesh

రెండు వేల ఎకరాలు భీమిలిలో కబ్జా అంటున్న లోకేష్ రెండు ఎకరాలు నిరూపించిన ఆ భూమి రాస్తానన్నారు. లోకేష్ దైర్యం ఉంటే భీమిలీలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ ఆత్మాభిమానం లేకుండ వ్యవహరిస్తున్నారు..సీఎం పదవి ఇవ్వమన్న ఛీ పొమ్మన్న పవన్.. టీడీపీ వెంట పడుతున్నారని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు దూరంగా పెట్టారు..పవన్ ను ఎందుకు దగ్గరకు తీసుకున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news