హైదరాబాద్‌ అభివృద్ధిపై కేసీఆర్‌ చేసిన పనులను కొనసాగిస్తా – సీఎం రేవంత్‌ !

-

హైదరాబాద్‌ అభివృద్ధిపై కేసీఆర్‌ చేసిన పనులను కొనసాగిస్తానన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఫైనాన్సిల్ జిల్లాలో నూతన తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..అనంతరం మాట్లాడారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై చంద్రబాబు, వైఎస్సార్‌, కేసీఆర్‌ పేర్లను ప్రస్తావించారు. గత సీఎంలు తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలను కొనసాగిస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై చాలా మందికి కొన్ని అపోహలున్నాయన్నారు.

CM Revanth Reddy will visit KCR

అపోహలను చర్చించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. నేను అప్పుడప్పుడు కనిపించే ముఖ్యమంత్రిని కాదు.. రెగ్యులర్‌గా కనిపిస్తానని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది…ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారన్నారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడం లో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమని చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news