BREAKING : సిబిఐ అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మకు అవినాష్ రెడ్డి లేఖ

-

సిబిఐ అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మకు లేఖ రాశారు ఎంపీ అవినాష్ రెడ్డి. 15,16,19 తేదీల్లో 160 సి ఆర్ పి సి సెక్షన్ కింద హాజరు కావాలని నోటీస్ ఇచ్చారని.. నా తల్లి అనారోగ్యం తో కర్నూల్ లోని విశ్వ భారతి హాస్పిటల్ లో చేరారని వెల్లడించారు. నా తల్లి అనారోగ్యం కు సంబందించిన మెడికల్ రిపోర్ట్స్ ను పొందపరుస్తున్నానని.. వైద్యుల సమక్షంలోనే నా తల్లి ఉండాలని వైద్యులు సూచించారని వెల్లడించారు.

నా తండ్రి ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.. నా తల్లి నీ చూసుకోవాల్సిన బాధ్యత నా పై ఉందని లేఖలో పేర్కొన్నారు అవినాష్‌ రెడ్డి. నా తల్లి ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొడుకు గా నేనే చుస్కోవాలని.. మీ ముందు విచారణకు హాజరయ్యేందుకు 7 రోజులు సమయం ఇవ్వండని కోరారు. హజరు కు 7 రోజుల సమయం ఇవ్వాలని సీబిఐని కోరారు అవినాష్ రెడ్డి. మరి దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news