BREAKING : వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

BREAKING : వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్‌ విజయమ్మతో సమావేశమయ్యారు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి.

వైఎస్‌ విజయమ్మతో లోటస్‌ పాండ్‌ లో ఎంపీ అవినాష్‌ రెడ్డి సమావేశమయ్యారు. సీబీఐ విచారణకు ముందు.. విజయమ్మతో లోటస్‌ పాండ్‌ లో ఎంపీ అవినాష్‌ రెడ్డి సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

కాగా, సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నానంటూ లేఖ రాశారు అవినాష్‌ రెడ్డి. ఈ కేసు విచారణ పారదర్శంగా సాగాలని కోరుతున్నా.. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని కోరారు. తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని వెల్లడించారు వైఎస్‌ అవినాష్‌రెడ్డి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?