సాయిరెడ్డి ఒక జైలు పక్షి, గంజాయి మొక్క : అయ్యన్న హాట్ కామెంట్స్ !

-

ఎంపీ విజయసాయి రెడ్డి పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షన్న ఆయన నందమూరి తారక రామారావు కుటుంబం అంటే తులసివనం లాంటిది. అలాంటి కుటుంబం నుండి వచ్చిన పురందేశ్వరి మీరు విమర్శిస్తారా ? అని ప్రశ్నించారు. మీకు ఆ అర్హత ఉందా ? అని ప్రశ్నించిన ఆయన విజయ్ సాయి రెడ్డి గంజాయి వనంలో గంజాయి మొక్క లాంటివాడని అన్నారు.

బ్రహ్మంగారి కాలజ్ఞానం లో, దొంగల రాజ్యం రాజ్యమేలుతారు అంటే నేను నమ్మలేదని ఆయన అన్నారు. అహంకారం ఉంటే నెత్తికెక్కి వాగుడు ఎక్కువగా మాట్లాడతారట, కళ్ళు మూసుకుపోయి, పోయే కాలం వచ్చిన వాళ్లే ఇవన్నీ మాట్లాడతారట అవన్నీ నాకు విజయసాయిరెడ్డి లో కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. విశాఖ భూ కుంభ కోణం పై సిట్t దర్యాప్తు వెేయడం కాదు దర్యాప్తు వెయ్యడం కాదు. సి బి ఐ ఎంక్వయిరీ వేయండని అయ్యన్న డిమాండ్ చేశారు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇందులో ఐఏఎస్ అధికారులు సైతం ఉన్నారన్న ఆయన అందరు జాతకాలు బయటకు వస్తాయని అన్నారు. దమ్ముంటే సి బి ఐ వెయ్యండని ఆయన సవాల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news