అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది: విజయసాయిరెడ్డి

-

టిడిపి నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.”అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది. మెదడుకి, నాలుకకు మధ్య ‘హుందాతనం’ అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్డు సిద్ధం చేయక తప్పేలా లేదు. ఓటమి తెచ్చిన ఫ్రస్త్రెషన్ వల్ల బాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే తయారైంది.” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు విజయసాయి రెడ్డి కౌంటర్ .” దావోస్ వెళ్లి బాబు ఏం చేశాడో, ఏం తీసుకొచ్చాడో ఇన్నాళ్లు ఎవరు పట్టించుకోలేదు. పాత వీడియోలు చూస్తే మాత్రం రాష్ట్రం పరువు తీసొచ్చాడు అని మాత్రం అర్థమవుతోంది. తన పాలనలో నేరాలే జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 2016- 19 మధ్య రాష్ట్రంలో1,44,703 నేరాలు నమోదైనట్టు ఎన్సిఆర్బి వెల్లడించింది” అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news