బ్రేకింగ్ : అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు !

-

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈఎస్ఐ మందుల అవకతవకలకు సంబంధించి ఆయనను ఏసీబీ రెండు నెలల క్రితం అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి కూడా ఆయన ఏసీబీ కస్టడీ లోనే ఉన్నారు. ఏసీబీ కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్ట్ ని ఆశ్రయించారు. ఆయనతో పాటుగా ఈ కేసులో ఏ 1 గా ఉన్న రమేష్ కుమార్ కూడా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.

atchannaidu
atchannaidu

అయితే రెండు సార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు ఎట్టకేలకి ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. ఇక ఇప్పటికే అచ్చెన్నను ఏసీబీ అధికారులు విచారించారు. ఆయన ఇప్పుడు అనారోగ్య సమస్యతో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అలా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ కూడా సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news