కిమ్ ఆన్ డ్యూటీ.. సాక్ష్యం ఇదిగో..!

-

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్​ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఆయన కోమాలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా విడుదైలన ఫొటోలతో ఇదంతా అసత్య ప్రచారమని రుజువవుతోంది. టైఫూన్​ బవి తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించారు కిమ్​. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. అయితే ఆయన ఎప్పుడు పర్యటించారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఫొటోలను గమనిస్తే బహుశా గురువారం మధ్యాహ్నం ఆయన సందర్శన జరిగి ఉంటుందని తెలుస్తోంది.టైఫూన్​ బవి తుపాను కారణంగా ఉత్తరకొరియాలో వరదలు సంభవించి తీవ్రనష్టం వాటిల్లింది. దక్షిణ హవాంఘే రాష్ట్రంలో గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి.

గత కొద్ది రోజులు క్రితం స్థానిక మీడియా ఈ విధంగా కిం కోమా లో ఉన్నట్లు కథనం ఇచ్చింది. కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు. తన సోదరి కిమ్ యోంగ్ ఉన్​కు కొన్ని అధికారాలు కట్టబెట్టిన అనంతరం ఆయన ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డై జంగ్ సహచరుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. తీవ్రంగా జబ్బుపడి మరణించారన్న కథనాలు కూడా వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news