రేపు ఏపీలో భారీ జాబ్‌మేళా.. వివరాలివే..!

-

మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగ యువతకు నిజంగా ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఈనెల 25వ తేదీన గుంటూరులో భారీ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. దీనితో ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఆ జాబ్ మేళ కి ఎటెండ్ అయ్యి ఉద్యోగం పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

jobs
jobs

ఈ నెల 25వ తేదీన అంటే రేపు గుంటూరులో భారీ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్‌మేళా జరగనుంది. ఎస్‌ఎస్‌సీ/ఇంటర్/డిగ్రీ, ఐటీఐ (ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, మెనాకిల్‌), /బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్‌సీ/ఎంఎస్సీ, కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ, జీఎన్‌ఎమ్‌/బీఎస్‌సీ (నర్సింగ్‌), బీటెక్‌/డిప్లొమా (మెకానికల్‌), ఎమ్‌బీఏ, బీకామ్‌ (కంప్యూటర్స్‌) పూర్తి చేసిన వారు ఎవరైనా ఈ జాబ్ మేళాకి ఎటెండ్ అవ్వచ్చు అని చెప్పారు.

ఈ జాబ్‌మేళాలో 6 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గా బాయి ప్రకటనలో తెలిపారు. ఇక అర్హత విషయంలోకి వస్తే.. ఈ జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే జాబ్ మేళాకి వెళ్లే వారు ఆధార్‌ కార్డు, రెజ్యూమేతో వెళ్లాల్సి ఉంటుంది.

ఉదయం పది గంటలకు గుంటూరులోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణం, గుజ్జనగుండ్లలో హాజరుకావాలి గమనించండి. పూర్తి వివరాల కోసం https://www.ncs.gov.in/ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ జాబ్‌ సీకర్‌గా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోకపోతే నేరుగా వెళ్లి కూడా రిజిస్టర్ చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news