పురంధేశ్వరి, సీఎం రమేష్ లకు ప్రధాని మోడీ బిగ్‌ షాక్ !

-

పురంధేశ్వరి, సీఎం రమేష్ లకు ప్రధాని మోడీ బిగ్‌ షాక్ ఇచ్చారు. కేబినెట్ లో చోటు ఆశించిన పురంధేశ్వరి, సీఎం రమేష్ లకు మొండి చేయి చూపించారు. ఏపీలో ఉన్న బీజేపీ ఎంపీల్లో ఒకరి మాత్రమే అవకాశం కల్పించారు. 1999 తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ బీజేపీ కి చోటు దక్కడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

big shock to bjp purandeshwari and cm ramesh

1998 వాజ్ పాయ్ మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా పని చేసిన కృష్ణం రాజు, SBPBK సత్యనారాయణ రావు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లోకి బీజేపీ ఎంపీ వెళ్ళడం ఇదే మొదటిసారి అవుతోంది. కేబినెట్ లో చోటు ఆశించిన పురంధేశ్వరి, సీఎం రమేష్ లకు మొండి చేయి చూపించారు. అనూహ్యంగా పార్టీ మూలాలు ఉన్న శ్రీనివాస్ వర్మను ఎంపిక చేసుకున్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news