శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంపై బిజెపి – జనసేన మధ్య ముదురుతున్న వివాదం

-

తిరుపతి: శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంపై తిరుపతి బిజెపి – జనసేన నాయకుల మధ్య వివాదం ముదురుతోంది. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు సెఫ్ అంటూ బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది జనసేన. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు సరిగా ఉన్నాయని.. దానిపై రాజకీయం చేయావద్దన్నారు బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి. అయితే తాజాగా భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి స్పందించింది జనసేన.

1100 కోట్లు పైగా శ్రీవాణికి ట్రస్ట్‌ కి నిధులు వచ్చాయని.. టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఎనిమిది వందకోట్ల మాత్రమే వచ్చాయాన్నారని తెలిపారు. మిగిలిన మూడువందల కోట్లు ఎం అయ్యాయని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకలు జరిగాయన్నారని.. దానిపై వెంటనే దర్యాప్తు చేయాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌ కు క్లీన్ చీట్ ఇవ్వమని బిజెపి చెప్పిన మాటనా.. లేక సోము వీర్రాజు మాటనా..? పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్లు బిజెపి నేత వ్యవహారం ఉందని జనసేన మండిపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news