సీఎం జగన్ కాన్వాయ్‌ని తగలబెడితే ఊరుకుంటారా..?

-

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయమై సీఎం జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా.. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. హిందూమతాన్ని నిర్వీర్యం చేయాలన్న కుట్రలో భాగంగానే రథాన్ని కాల్చారని విమర్శించారు.

ఏపీలో హిందువులకు రక్షణ కరువైనట్టు కన్పిస్తోందన్నారు. హిందూ మతంపై దాడి చేస్తే సహించేదిలేదన్నారు. అదే ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని తగలబెడితే ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని భారీ రథం శనివారం రాత్రి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని ఒక్కసారిగా ఎగిసిపడటంతో రథం పూర్తిగా కాలి బూడిదైంది. 40 అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం పూర్తి టేకు కలపతో తయారు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news