బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ : సీఎం రేవంత్ రెడ్డి

-

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఆలోచన చేసింది వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి.. ఆయన చేసినట్టుగానే షర్మిల కూడా పాదయాత్ర కూడా చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో మేధావులు ఏపీకి సంబంధించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఏపీని శాసించాలనుకుంటున్నారు. 

జగన్ అయినా, బాబు గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ప్రశ్నించే గొంతు వారికి ఉందా..? వైఎస్సార్ ఏ రోజు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వలేదనిన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎవ్వరూ గెలిచినా మోడీ ఖాతాలోకే.. వైఎస్సార్ వల్లనే పేదలకు మేలు జరిగింది. 25 ఎంపీలు షర్మిలమ్మకి ఇవ్వండి.. విశాఖ ఉక్కును ఎలా కొల్లగొడుతారో చూద్దాం. తెలంగాణలో కూడా చాలా మంది కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. షర్మిల ముఖ్యమంత్రి అయితే ఏపీకి డెవలప్ మెంట్ జరుగుతుందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news