పల్నాడ్ పాలిటిక్స్…వాలంటీర్ ఇంట్లో నాటు బాంబులు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో హింస వాతావరణం ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. ఇలాంటి తరుణంలోనే…పల్నాడు జిల్లా పెను సంచలనం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని ఓ వాలంటీర్ ఇంట్లో నాటు బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. బెల్లంకొండ నాగిరెడ్డిపాలెంలోని ఓ వాలంటీర్ ఇంట్లోనే ఈ బాంబులు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.

Bombs planted at volunteer’s house

దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తయారు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సంఘటన గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news