వైసీపీ నాయకులు దేశం వదిలి వెళ్ళిన లాక్కొచ్చి శిక్ష వేస్తాం – బుద్దా వెంకన్న

-

వైసీపీ నాయకులు దేశం వదిలి వెళ్ళిన లాక్కొచ్చి శిక్ష వేస్తామని హెచ్చరించారు బుద్దా వెంకన్న. తెలంగాణ ఎన్నికలు చూసి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వదిలి పారిపోయేందుకు చాలామంది సిద్ధమవుతున్నారని చురకలు అంటించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తాను…నాకు సీటు ఇవ్వాలని చంద్రబాబు ను అడుగుతానని పేర్కొన్నారు.

budda venkanna warns ycp leaders

బీసీ అభ్యర్థిగా ఇక్కడ నాకు సీటు ఇస్తారని నమ్మకం ఉందని.. ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందన్నారు. చంద్రబాబు కుటుంబం మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నానని పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోలేదని ఆ పార్టీ నేత బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. టిడిపిపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శిస్తే ప్రతి విమర్శలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. టికెట్ ఇవ్వకపోతే తన దగ్గర ఆప్షన్ బీ కూడా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news