కొడాలి నాని గంజాయి తాగి చంద్రబాబును విమర్శిస్తున్నారు – బుద్దా వెంకన్న

-

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి నేత బుద్ధా వెంకన్న. విజయనగరంలో మంగళవారం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని గంజాయి తాగి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆరోపించారు. గంజాయి మత్తులో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావడం లేదన్నారు. కొడాలి నాని వ్యవహార శైలి నచ్చక టిడిపి నుండి బయటకు పంపినట్లు తెలిపారు.

కొడాలి నాని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. నాని ఎన్టీఆర్ కుటుంబంలో తగువులు సైతం పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనను మరోసారి అడ్డుకోవాలని చూస్తే చాము గట్టిగానే దాడులు చేస్తామని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును 78% పూర్తి చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర వైసిపి ప్రభుత్వానిదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news