నూతన గవర్నర్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు

-

ఏపీకి కొత్త గవర్నర్ నియామకం అయ్యారు. పలు రాష్ట్రాల గవర్నర్లను తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ తరుణంలోనే ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఏపీ కొత్త గవర్నర్ గా ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. అబ్దుల్‌ నజీర్… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా గతంలో పని చేశారు. ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ విశ్వ భూషణ్ హరిచంద్రను చత్తీస్‌ ఘడ్‌ గవర్నర్ గా బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో నూతన గవర్నర్ గా నియమితులైన ఎస్ అబ్దుల్ నజీర్ కు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చిత్తశుద్ధి, నిజాయితీ గల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో కచ్చితంగా ముందంజలో ఉంటారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పదవిలో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news