ఏపీ గిరిజన సోదరులకు చంద్రబాబు శుభవార్త !

-

Chandrababu good news for AP tribal brothers: ఏపీ గిరిజన సోదరులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఏపీ గిరిజన సోదరులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని గిరిజన సోదరులకు నా శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి అని తెలిపారు సీఎం చంద్రబాబు.

Chandrababu good news for AP tribal brothers

అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు చంద్రబాబు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించామని వెల్లడించారు. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించామని గుర్తు చేశారు. గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమేనన్నారు. రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్ ను అందిస్తామని తెలియజేస్తున్నాను అని హామీ ఇచ్చారు బాబు.

Read more RELATED
Recommended to you

Latest news