త్వరలోనే చంద్రబాబుకు చమరగీతం పాడుతారు – సీపీఐ నారాయణ

-

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాకపోతే… త్వరలోనే చంద్రబాబుకు చమరగీతం పాడుతారని వార్నింగ్‌ ఇచ్చారు సీపీఐ నారాయణ. ఇవాళ మీడియాతో సీపీఐ నారాయణ మాట్లాడుతూ… బడ్జెట్‌లో ఏపీకి వచ్చింది అప్పు మాత్రమేనని… ఏపీకి ఎదో ఇచ్చేమని నిర్మలసీతారామన్ అందంగా అబద్దాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదా తీసుకుని రాకపొతే కూటమీ ప్రభుత్వానికి చమరగీతం ప్రజలు పాడుతారని వార్నింగ్‌ ఇచ్చారు.

cpi narayana fires on chandrababu

చంద్రబాబు సొంత జిల్లాలో అడుగుపెట్టనీకుండా రాజకీయ చేసింది జగన్ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లో జగన్… ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఒక ప్లాప్ షో అన్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని తెలిపారు. ‌‌రెండు నెలలకే… రాష్ట్రపతి పరిపాలన కోరడం విడ్డురంగా ఉందని జగన్‌పై మండిపడ్డారు. ఎన్నికల‌ కమిషన్ సైతం…. ఈవిఎంలను టాంపర్ చేసిందనే అనుమానం… విమర్శలు ఉన్నాయన్నారు సీపీఐ నారాయణ. ఈవిఎంలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news