ఏపీ లో ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు సీరియస్

-

అమరావతి : విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతి పై సామూహిక అత్యాచారం చేయటం ఏపీకే అవమానం అని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డలకు ఇక రక్షణ ఎక్కడుంది అని నిలదీశారు.

ఈ సంఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నేను సిగ్గుపడుతున్నానని సీరియస్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. నేరుగా ఆసుపత్రికి రాకుండా మోసపూరిత సున్నా వడ్డీ కోసం సీఎం ప్రకాశం జిల్లా వెళ్లారన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జరిగిన సంఘటన ప్రభుత్వానికి అవమానంగా అనిపించట్లేదా..? అని అగ్రహించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఇంకెన్ని మానభంగాలు జరగాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news