ఏపీలో రాజరాజ్యమంటూ చంద్రబాబు వివాదస్పద పోస్ట్‌ !

-

ఏపీలో రాజరాజ్యమంటూ చంద్రబాబు వివాదస్పద పోస్ట్‌ పెట్టారు. ఇవాళ శ్రీరామ నవమి అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం… ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన అంటూ పేర్కొన్నారు.

chandrababu reacts on cm jagan

పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోందన్నారు చంద్రబాబు. అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుంది. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని వివరించారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం నాటి పాలన అందిరావాలని కోరుకుంటూ… మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌ పెట్టారు. దీనిపై వైసీపీ పార్టీ మండిపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news