భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్…ఒకరు మృతి, 28 మందికి !

-

భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ సంఘటనలో ఏకంగా 28 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో చిన్నారులను హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే..హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. వాస్తవానికి ఈ నెల 12 న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది.

Food poisoning in Bhuvangiri Gurukula School

బ్రేక్ ఫాస్ట్ లో పులిహోర తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు 28 మంది విద్యార్థులు. ఈ తరుణంలోనే పలువురిని భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించారు. అయితే..హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన చిన్నారి పోచంపల్లి మండలం జిబ్ లక్ పల్లి గ్రామానికి చెందినవాడు. ఇక దీనిపై విచారణ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news