డిసెంబర్​ 1న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

-

స్కిల్ డెవలప్​మెంట్ కేసులో బెయిల్ మంజూరై బయటు ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇటీవలే కంటి చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

డిసెంబరు ఒకటో తేదీన చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికే తిరుమల చేరుకోనున్న ఆయన రాత్రి కొండ మీదే బస చేయనున్నారు. శ్రీవారి దర్శనం అయ్యాక రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతి చేరుకుని అక్కడి నుంచి.. విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. ఇటీవలే కంటి శస్త్రచికిత్స చేయించుకున్న చంద్రబాబు కొంతకాలంగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో… డిసెంబరు మొదటి వారం నుంచి ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version