అసత్యాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టుకతోనే వచ్చింది : మోహన్ బాబు

-

టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. ఈ ఘటన చుట్టూ రాజకీయ నాయకులే కాదు.. అనేక వర్గాలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కొందరు ఆయన అరెస్టును ఖండిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సందర్భంలో సీనియర్ ఎన్టీర్‌ను చంద్రబాబు మోసం చేశాడనే ఎపిసోడ్ పై చర్చ మొదలైంది. ఇలా పాత విషయాలు చర్చలోకి వచ్చిన తరుణంలో చంద్రబాబు పై టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు మిత్రుడని చెప్పారు. అదే సందర్భంలో ఆయనకు అసత్యాలు చెప్పడం పుట్టుకతోనే నరనరాన జీర్ణించుకుపోయిందని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పై చెప్పులు విసిరేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని వివరించారు. వైస్రాయ్ హోటల్ ఘటనను ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉన్నదని, అందుకే ఆయన గురించి ఇతరుల కంటే తనకు ఎక్కువ తెలుసు అని చెప్పారు. అతనికి పుట్టుకతోనే అసత్యాలు చెప్పడం నరనరాన జీర్ణించుకోపోయిందని అన్నారు. తెలుగులో నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ సినిమాలు మానేసి తన కుమారుడు హరికృష్ణతో కలిసి అవిశ్రాంతంగా తిరిగి తెలుగుదేశం పార్టీని స్థాపించారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news