చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి తృటిలో తప్పిన ప్రమాదం..!

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరం కి ఇండిగో విమానంలో బయలుదేరారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న తరువాత లాండింగ్ సమయంలో ఈ విమానం లో సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం లాండింగ్ సమయంలోనే వీలు తెచ్చుకోలేదు.

దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని మళ్ళీ తేకప్ చేయగా కొద్దిసేపు అలాగే గాలిలో చెక్కర్లు కొట్టింది. అనంతరం వీలు బయటికి రావడంతో పైలెట్ విమానాన్ని సేఫ్గా లాండింగ్ చేశారు. విమానానికి త్రుటిలో పేను ప్రమాదం తప్పడంతో అధికారులు ప్యాసింజర్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబుకు తృటిలో విమాన ప్రమాదం తప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు హెలికాప్టర్లో అరకు బయలుదేరగా.. సాంకేతిక సమస్య కారణంగా బాబు ప్రయాణించిన హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేసింది. వెంటనే జే టి సి పైలెట్ ను అప్రమత్తం చేయడంతో చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. తాజాగా ఆయన సతీమణి కూడా ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news