తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోకి చిరుత సంచారం.. భయాందోళనలో విద్యార్థులు

-

తిరుపతి ఎస్వీ యూనివర్సిటి కళాశాలలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘం నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఆదివారం రాత్రి ఇంజినీరింగ్ కళాశాలలో చిరుత కనిపించింది. దీంతో కళాశాలకు చెందిన విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతలు ఇలా కళాశాల సమీపంలో, ఎన్సీసీ గేట్ వద్ద దర్శనమివ్వడం చూసి పరుగులు తీశారట కొందరూ విద్యార్థులు. 

ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో, చిరుత పులుల సంచారం చాలా ఎక్కవగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తిరుపతిలో చిరుతల సంచారం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. గత కొంత కాలంగా ఎస్వీ యూనివర్సిటీలో పులులు సంచారం ఎక్కువ ఉందని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇటీవలే తిరుపతిలో కాలినడక దర్శనానికి వెళ్తున్న సమయంలో ఓ బాలుడిని ఎత్తికెళ్లిన విషయం విధితమే. తాజాగా ఎస్వీ కళాశాలలో సంచారం చేయడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news