ఏపీ ప్రజలు, అధికారులు మరో 24 గంటలకు అలర్ట్‌ గా ఉండాలి – సీఎం చంద్రబాబు

-

ఏపీ ప్రజలు, అధికారులు మరో 24 గంటలకు అలర్ట్‌ గా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. వరద సహయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితి.. యహయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీస్తున్నారు. బాధితుల వద్దకు రెస్క్యూ టీంస్ వెళ్లేలా చూడాలన్న చంద్రబాబు….వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. సహయక బృందాలు తమ వద్దకు రాలేదన్న మాటే బాధితుల నుంచి రాకూడదని సీఎం చంద్రబాబు ఆర్డర్స్‌ ఇచ్చారు.

CM Chandrababu said that AP people and officials should be on alert for another 24 hours

అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు….గర్భిణుల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. బాధితుల్లో గర్భిణులు ఉంటే వారిని సమీప ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల తరలింపులో ప్రత్యేక శ్రద్ధ తీసుకేవాలని సీఎం సూచనలు చేశారు. పునరావాస శిబిరాలను పరిశుభ్రంగా ఉంచాలని సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news