సీఎం జగన్‌, విజయ్ సాయి రెడ్డిలకు సిబిఐ కోర్టులో ఊరట

-

సీఎం జగన్‌, విజయ్ సాయి రెడ్డిలకు గుడ్‌ న్యూస్‌. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విజయ్ సాయి రెడ్డి లకు సిబిఐ కోర్టు లో ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విజయ్ సాయి రెడ్డి లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది సిబిఐ కోర్టు.

సెప్టెంబర్ 2 నుండి 12 వరకు ఫ్యామిలీ వెకేషన్ నిమిత్తం యు కే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు నెల రోజుల పాటు విజయ సాయి రెడ్డి కి విదేశీ టూర్ కు అనుమతి ఇచ్చిన సిబిఐ కోర్టు… టూర్ కు అనుమతి ఇవ్వద్దని సిబిఐ వాదనను తోసి పుచ్చింది.

కాగా, కౌలు రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులతో కలిపి రైతులందరికీ అందిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధుల విడుదల కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ 1.46 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 109.74 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రోగ్రాం వాయిదా పడినట్లు ఉన్నతాధికారులు కాసేపటి క్రితం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news