మందు బాబుల నుంచి 3 లక్షల కోట్లు కొటేసాడు – రఘురామ

-

 

ఎన్నికలకు ముందు దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని మహిళలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు మద్య నిషేధమన్నది అమలు చేయకుండా గృహిణులు దాచుకున్న 3 లక్షల కోట్ల రూపాయలను వారి భర్తల ద్వారా కొట్టేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఆడపడుచుల భర్తల రక్త, మాంసాలను దోచుకొని అందులో కొంత పంచి “జగన్ ఎందుకు కావాలి… ఎందుకు రావాలో” ప్రచారం చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు.

గతంలో 60 రూపాయలకు నాణ్యమైన మద్యం సీసా క్వార్టర్ లభించగా, ఇప్పుడు నాసిరకమైన క్వార్టర్ మద్యం సీసాను 160 రూపాయలకు విక్రయించి లక్షల కోట్ల రూపాయల డబ్బు దోచుకుంటున్నారన్నారని, ఈ డబ్బంతా రూపాయి, రూపాయి చొప్పున మహిళలు దాచుకున్న సొమ్మేనని, దోమ మనిషికి తెలియకుండానే రక్తాన్ని పీల్చినట్టుగా, జలగ సైజు కలిగిన ఈ దోమ మీ భర్త రక్తాన్ని లాగేస్తూ… తిరిగి మైక్రో మిల్లీమీటర్ అంత రక్తాన్ని వెనక్కి ఇచ్చి సంఘసంస్కర్త మాదిరిగా ఫోజులు కొట్టడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మహిళలారా మేల్కొనండి… కీలేరిగి వాత పెట్టే సమయం వచ్చింది… మీ భర్తలకున్న మద్యం అలవాటును ఇప్పటికిప్పుడు ఎలాగూ మానిపించలేరు… మరో ఆరు నెలలు ఓపిక పట్టండి… నాణ్యమైన మద్యాన్ని సేవించే అవకాశం వారికి రానున్న ప్రభుత్వ హయాంలో లభిస్తుంది… అప్పుడు మీ భర్తల జీవితకాలం మరో 20 నుంచి 30 ఏళ్లు పాటు పదిలంగా ఉంటుందని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news