ఏపీ మెడికల్ విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త !

-

ఏపీ మెడికల్ విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు YSR వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రకోట కింద సీట్లను భర్తీ చేయనుంది. నీట్ లో ర్యాంకులు సాధించిన వారు నేటి నుంచి 26 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు https://drysr.uhsap.in లో చూడగలరు.

2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన ప్రైవేట్, మైనార్టీ, వైద్య, డెంటల్ కాలేజీల్లో కాంపిటేంట్ కోటా MBBS, BDS సీట్లలో 100% రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా ఇటీవల ప్రభుత్వం సవరణలు చేసింది. కాగా, ఏప్రిల్ లో జరిగిన రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి నేటి నుంచి ఆగస్టు 2 వరకు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ గ్రౌండ్ లో అగ్నివీర్ నియామక ర్యాలీ జరగనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఎన్టీఆర్, పార్వతీపురం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణ జిల్లాల అభ్యర్థులు పాల్గొనవచ్చు. దాదాపు 10వేలమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version