నేడు ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం

-

ప్రధాని మోడీతో నేడు ఏపీ సీఎం జగన్ కీలక భేటీ కానున్నారు. పార్లమెంట్ లో ఈ రోజు ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోడితో భేటీ కానున్నారు ఏపీ సీఎం జగన్. ఆ తర్వాత పార్లమెంట్ లో 11.45 గంటలకు అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి సీఎం జగన్‌ అడుగనున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ చెబుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే ఢిల్లీ పర్యటన అంటోంది.

CM Jagan meeting with Prime Minister Modi and Amit Shah today

అయితే.. చంద్రబాబు, జగన్ లతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ…ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలకు సమదూరం పాటిస్తున్నట్లు సందేశం పంపిస్తోంది. నడ్ఢా, అమిత్ షా లతో చంద్రబాబు మొన్న సుదీర్ఘ భేటీ జరిపిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది. ప్రధాని మోడీ, అమిత్‌ షాతో నేడు ఏపీ సీఎం జగన్ కీలక భేటీ కానున్నారు. అటు ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై బీజేపీ ఇరువురి అగ్రనేతలతో సీఎం జగన్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news