పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలి : సీఎం జగన్

-

పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరం పర్యటనలో బిజీ బీజీగా గడిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన, అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలని వెల్లడించారు. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్న సీఎం జగన్‌… పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్‌ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news