రేపు ఏపీ ఎన్జీవో మహాసభకు సీఎం జగన్

-

విజయవాడ: రేపు,ఎల్లుండి ఎపీఎన్జీవో సంఘం 21 వ కౌన్సిల్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహాసభలు నిర్వహించనున్నారు. రేపు ఈ మహాసభకు హాజరుకానున్నారు సీఎం వైఎస్ జగన్. దీంతో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు ఎపీ ఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు బండిశ్రీనివాస్, శివారెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్జీవోలు, ఆర్టీసీ సహా పబ్లిక్ సెక్టార్లు, పెన్షనర్లు ఈ మహాసభలకు తరలివస్తారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉద్యోగులు క్రమశిక్షణతో మహాసభను జయప్రదం చేయాలని కోరారు. మహాసభలో ఉద్యోగులకు సంబంధించి పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news