ఇవాళ విశాఖలో సీఎం జగన్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

-

 

సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలోనే ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు సీఎం జగన్‌. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి విశాఖకు బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్‌.. సాయంత్రం 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరణ, సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవలోని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు సీఎం జగన్.

సాయంత్రం 5.50 గంటలకు వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభించనున్న సీఎం జగన్.. రామ్‌ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ శంకుస్ధాపన చేస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఏయూ కన్వెన్షన్‌ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొననున్న సీఎం… ఇవాళ రాత్రి 8.20 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news