టీఎస్‌పీఎస్సీ కేసులో రేణుకకు బెయిల్‌

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకే కేసులో ఓవైపు ఈడీ.. మరోవైపు సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 23 మందిని అరెస్టు చేసిన ఈడీ వారిని క్షుణ్నంగా విచారిస్తోంది. ఈ విచారణలో రోజుకో కీలక అంశం బయటపడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రవీణ్ నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన నిందితురాలు రేణుకా రాఠోడ్​కు తాజాగా బెయిల్ మంజూరయింది.

రేణుకా రాఠోడ్‌కు నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని.. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్‌ ఎదుట హాజరు కావాలని, పాస్‌పోర్టు సమర్పించాలని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ కేసులో రేణుకా రాథోడ్‌(ఏ3), ఆమె భర్త డాక్యానాయక్‌(ఏ4) నిందితులుగా ఉన్నారు. రేణుక అనారోగ్యం, మహిళ కావడం, దర్యాప్తు అంతిమ దశలో ఉందన్న కారణాలపై బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది గుమ్మకొండ శ్రీనివాసరావు తాజాగా న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో ఆమెకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో డి.రమేశ్‌కుమార్‌(ఏ12), టి.రాజేందర్‌(ఏ14)లకు సైతం బెయిల్‌ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news