Cm Jagan: నేడు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ

-

Cm Jagan: రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు.

cm jagan ycp siddam sabha in rapthadu

సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన రెండు సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఈ సభ నేపథ్యంలోనే… అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసిపి ఎన్నికల ఊపు అందుకుంటుంది…అందుకే ప్రతిష్టాత్మంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసిపి శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయని…ఈ సభతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు సిద్దం సభలు పూర్తి అవుతాయని వివరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news