BREAKING: ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర…అక్కడి నుంచే ప్రారంభం

-

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : సీఎం జగన్ ఎన్నికల ప్రచారంపై కీలక అప్డేట్‌ వచ్చేసింది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్….ఈ నెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారు.

CM Jagan’s bus trip from 27th of this month

ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్ బస్సుయాత్ర చేస్తారు. 20 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది. దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహిస్తారు సీఎం జగన్‌. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ..ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర ఉంటుంది.

ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు సీఎం జగన్‌. ఇంటరాక్షన్లో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరణ ఉంటుంది. బస్సు యాత్రపై పూర్తి వివరాలు రేపు వెల్లడించనుంది వైసీపీ పార్టీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్.జగన్… బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news