ఇవాళ సీఎం జగన్ శ్రీసత్య సాయి జిల్లా పర్యటన

-

ఇవాళ సీఎం జగన్ శ్రీసత్య సాయి జిల్లా పర్యటనకు వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌… పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.15కు గోరంట్ల మండలం పాల సముద్రం చేరుకోనున్న సీఎం జగన్…మూడు గంటల 10 నిమిషాలకు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలుకనున్నారు.

ప్రధాని, గవర్నర్ తో కలిసి నాసిన్ – నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్…సాయంత్రం ఏడున్నరకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. కాగా,  శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ దేశ ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్షపన్నులు,మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేశారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రం ఏర్పాటు అయింది. అయితే.. వీటిని ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోదీ.  ఈ తరుణంలోనే… మోదీ కి సిఎం జగన్ , గవర్నర్ అబ్ధుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news