పల్లె, పట్టణప్రగతిపై ఇవాళ సీఎం కేసీఆర్ కీలక సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18 వ తేదీ బుధవారం అంటే ఈ రోజున ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

అయితే.. ఈ కీలక సమావేశంలో.. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరో పది రోజుల్లో వర్షా కాలం రాబోతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వర్షా కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news