BREAKING : విజయవాడలో జాతీయ జెండాను ఎగుర వేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక మరికాసేపట్లోనే.. .విజయవాడలో జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఈ సందర్భంగా సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న ముఖ్యమంత్రి జగన్‌… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక అటు ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉదయం 10 గంటలకు వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనుండగా, జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు విజయ సాయి రెడ్డి. ఇక ఉదయం 9 గంటలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్ పురంధరేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news