అమరావతికే కట్టుబడి ఉన్నాం – పురందేశ్వరి

-

ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అన్న విషయానికి బిజెపి కట్టుబడి ఉందని అన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి. నేడు గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు, రైల్వేలు, పోర్టులకు అధిక మొత్తంలో నిధులు కేటాయించామని.. ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు పురందేశ్వరి. బిజెపి రాష్ట్రానికి సహకారం అందించలేదు అన్నది దుష్ప్రచారం మాత్రమే అన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ఇళ్ల నిర్మాణం పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా సాగు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మెడికల్ కాలేజీల నిర్మాణంతోపాటు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏపీలో నెలకొల్పడం జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news