కరోనా థర్డ్ వేవ్ : సీఎం జగన్ కీలక ఆదేశాలు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై ఇవాళ సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను సిఎం జగన్ కు వివరించారు అధికారులు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అధికారులు.. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 27వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారని.. వీరిలో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని చెప్పారు అధికారులు.

సుమారు 28వేల బెడ్లను సిద్ధంచేశామన్నారు అధికారులు. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే దిగువన ఉన్న ఐదు జిల్లాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు అని తెలిపారు. మరో 5 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయిందని.. మరో నాలుగు జిల్లాల్లో 80 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం జగన్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news