ఏపీలో మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారు: సీపీఐ నారాయణ

-

ఏపీలో మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారు అని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము టిడిపితో కలవాలని అనుకుంటున్నప్పటికీ….. ఆ పార్టీ పక్క చూపులు చూస్తోందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టిడిపిని కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్లీ వైయస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఒకవేళ టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం తాము మద్దతు ఇస్తామన్నారు. బిజెపికి మద్దతు ఇవ్వనందుకే చంద్రబాబును జైలుకు పంపారని నారాయణ ఆరోపించారు. కేంద్రం కాళ్లపై జగన్ పడటంతోనే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని నారాయణ విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పదేళ్లుగా బెయిల్ పై ఉండి ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఏపీ సీఎం జగన్ మాత్రమే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news