అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు – డిప్యూటీ సీఎం నారాయణ

-

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చంద్రబాబు ఓ నయవంచకుడని గతంలో దుమ్మెత్తి పోసిన మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్నాడని మండిపడ్డారు. అయితే ఆదివారం ఉదయం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు నర్సింహులు.

స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం 2021లో కేసు నమోదు అయితే.. ఎఫ్ఐఆర్ లోన్ పేరు లేని వ్యక్తిని నాలుగేళ్ల తర్వాత అరెస్టు చేసిన ఘనత సీఎం జగన్ దేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్షకు దిగారు. దీంతో మోత్కుపల్లి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

ఎన్టీఆర్ ని చంపించింది చంద్రబాబు అని మోత్కుపల్లి అన్నాడని.. కానీ ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషి అంటూ పొగుడుతున్నాడని విమర్శించారు. మోత్కుపల్లి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సహించమని హెచ్చరించారు. అసలు అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు అని అన్నారు నారాయణస్వామి. డబ్బు, పదవి కోసం ఎన్టీఆర్ కి పురందేశ్వరి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news