పోస్ట్‌ ఆఫీస్‌లో ఈ స్కీమ్‌లో జాయిన్‌ అయితే నెలకు రూ. 9250 పొందొచ్చు

-

చిన్న, మధ్య తరగతి వాళ్లకు పోస్ట్ ఆఫీస్‌ స్కీమ్స్‌ చాలా ఉపయోగపడతాయి. తక్కువ ప్రీమియంతో పొదుపు చేస్తూనే.. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను పొందవచ్చు. పోస్టాఫీస్ తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్ అందిస్తుంది. కొత్తగా పొదుపు చెయ్యాలనుకొనేవారికి ఇది మంచి బెనిఫిట్స్ ఇస్తుంది.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అందిస్తోంది..ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ స్కీమ్‌లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..అయితే ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బుపై మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో రాబడి పొందొచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులుకు మీకు వస్తాయి. ఈ స్కీమ్ వల్ల మీరు రూ.9 లక్షల వరకు దాచుకోవచ్చు. అలాగే మీరు జాయింట్ అకౌంట్ తీసుకుంటే రూ.15 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు. గతంలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ లిమిట్ చాలా ఎక్కువగానే ఉంది.

రాబడి ఎలా ఉంటుందంటే..

స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం మేర వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి తగ్గొచ్చు. లేదంటే పెరగొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకు మీరు ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు మీకు చేతికి ప్రతి నెలా రూ. 9,250 వరకు వస్తాయి. అదే మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెలా రూ. 3 వేలు పొందవచ్చు. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news