మంత్రి పయ్యావుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్ మార్పు..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రేపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఛాంబర్ ను మార్చారు.

తొలుత సచివాలయంలోని 212, 214 రూమ్ లను కేటాయించగా.. ఆ గదులు తనకు కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ అడిగినట్టు సమాచారం. దీంతో పవన్ కోసం 211 రూమ్ ను సిద్ధం చేశారు. కాసేపట్లో ఆయన ఛాంబర్ ను పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక్కడే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news