జగన్ కీలక నిర్ణయం : అవినీతి అంతానికి దిశ తరహా చట్టం

-

ఈరోజు అవినీతి నిరోధక చర్యలపై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా దిశ తరహాలో అసెంబ్లీలో బిల్లు పెడతామని జగన్ పేర్కొన్నారు. అంతే కాక 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు వచ్చే అన్ని అవినీతి సంబంధిత అంశాలూ ఏసీబీకి చెందిన 14400కు బదలాయింపు అయ్యేలా చూడాలని ఆయన అధికారులకి సూచనలు కూడా చేసారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా ఏసీబీకి అనుసంధానం చేయనున్నట్టు పేర్కొన్నారు.

jagan
jagan

ఎమ్మార్వో, ఎండీఓ, సబ్‌ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు జగన్ పేర్కొన్నారు. ఇదే కాక రివర్స్ టెండరింగ్ విధానం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ చేయాలని, టెండర్‌ విలువ రూ.కోటి దాటితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనిన్ ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్‌ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుల విషయాల్లో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా స్పష్టం అయిందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news