దివ్య హత్య కేసు దిశ పోలీసులకు బదిలీ

-

విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసుని దిశ పోలీసు స్టేషన్‌కు బదిలి చేశారు పోలీసు అధికారులు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు నిజమో కావో తేల్చడానికి ఫోరెన్సిక్ సాయం కూడా తీసుకుంటున్నారు పోలీసులు. ఇక దివ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తమ కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నారేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు దివ్య తేజశ్విని తల్లిదండ్రులు.

దివ్య శరీరంపై ఉన్న 13 కత్తి పోట్లే నాగేంద్ర కిరాతకానికి సాక్ష్యమని వారు చెబుతున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న తమ కూతుర్ని నిద్రలోనే చంపాడని, దివ్యను చంపాక… తాను మాత్రం చిన్న గాయాలు చేసుకున్నాడన్నారు. దివ్యను పెళ్లి చేసుకున్నానంటున్న నాగేంద్ర మాటల్లో నిజంలేదని, పథకం ప్రకారమే ఆమెను హత్య చేసి… మీడియాతో మాట్లాడుతున్నాడని ఆరోపించారు తండ్రి జోసెఫ్‌. ఇక నిన్న వారింటికి వెళ్లి పరామర్శించి వెళ్లారు. దివ్య కుటుంబానికి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news