ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..!

-

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం తాజాగా ముగిసింది. సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటల తరువాత ప్రారంభమైన సమావేశం.. మధ్యాహ్నం 2 గంటల సమీపంలో ముగిసింది. కేబినెట్ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు.

చెత్త పన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం పై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది. మరోవైపు దేవాలయాల పాలక మండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. ఇద్దరూ బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో ట్రాక్టర్లు, లారీలతో పాటు ఎడ్ల బండ్లలో కూడా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత ఇసుకను పూర్తిగా ఉచితం చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news